ముఖ్యాంశాలు

ప్రజా భద్రత భేష్
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మార్గదర్శనంలో హోం శాఖ ప్రజల భద్రతకు సంబంధించి విన్నూత్న కార్యక్రమాలు చేపట్టింది.

రాజన్న సిరిసిల్లకు అగ్రస్థానం
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 డిసెంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.

సమవీక్షణ వీక్షణం
బడికి వెళ్ళే పసిప్రాయంలోనే ‘భావమంజరి’ అనే పద్యకృతి, మూడు పదుల వయసులోనే ‘చేదబావి’ కవితా సంపుటి, స్నేహితులతో కలిసి ‘ఆచూకీ’, మొన్న మొన్నటి వేర్పాటు తెలంగాణా ఉద్యమంలో ‘తండ్లాట’ వెలువరించి, అటు పండిత ప్రకాండులు, ఇటు సామాన్య ప్రజ అభిమానం చూరగొన్న కవి, కథకులు డా॥ కాంచనపల్లి గోవర్ధన రాజు.

సీఎం సహాయ నిధికి ముఖరా కె గ్రామం విరాళం
తెలంగాణలోని పల్లెలు ప్రగతి పథాన పయనిస్తున్నాయనడానికి సాక్ష్యంగా ఈ విజయ గాథను పేర్కొనవచ్చు. తమ గ్రామాన్ని పరిశుభ్రంగా వుంచుకోవడం వల్ల సేకరింపబడిన చెత్త ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్నది ముఖరా కె గ్రామం.

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు
జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్ హౌజ్ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.
సంపాదకీయం

తెలంగాణ మోడల్….
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నది జగమెరిగిన సత్యం. కనుచూపు కరవైన బతుకెందుకు… అనే ఆవేదనా భరిత గీతాలు మనకు తెలుసు.