సిరిసిల్లలో అపెరల్ పార్క్
తెలంగాణ ప్రభుత్వం, టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.ఈ ఎంఓయూ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలోని 7.42 ఎకరాలలో నిర్మిస్తున్న అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ కంపెనీ తమ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది.
మొదట టెక్స్పోర్ట్ కంపెనీ, 800 మెషీన్లను ఏర్పాటు చేసి సుమారు 1600 మందికి ఉపాధి కల్పించనున్నది. ఆ తర్వాత మూడు సంవత్సరాల వ్యవధిలో సుమారు 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా 1000 మెషీన్లకు దీనిని విస్తరించనున్నట్టు ఎంఓయూ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు.
