గిరిజన కులదైవం నాగోబా జాతర

girijanalu

మన దేశచరిత్రలో పూర్వ కాలం నుండి ప్రజలు నదీనదాలను, జంతువులను, పక్షాదులను, అనకే జీవచరాలను  ప్రేమించడం  పూజించడం కనిపిస్తుంది. హిందూ సంప్రదాయంలో నాగులకు ప్రత్యేక స్థానం
గమనించవచ్చు. కొండలు, కోనల్లో జీవించే గిరిజనులకు నాగోబా విశిష్టమైన దేవుడు. గోండు మత పెదల్ద మౌఖిక కథనం ప్రకారం పూర్వం మేస్రం వంశస్తుల్లో  వెడ్చాల్‌దేవ్‌, రూప్‌దేవీలకు ఏడుగురు మగ సంతానం. వారు వరసగా అలేష్‌కాల్‌, భాలేష్‌కాల్‌,ఆలేబతాల్‌,
అసుములాల్‌, గన్‌ములాల్‌, సోన్‌ములాల్‌, జోలేజైతాల్‌, వీరిలో భాలేష్‌కాల్‌కు ఒక విచిత్రమైన ఆసక్తి కలిగింది. గోండులు నాగ వంశస్తులు కాబట్టి తమ వంశ-మూల విరాట్టును దర్శించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అన్నదమ్ముల నుండి వీడ్కోలు తీసుకోని నాగలోకానికి బయలు దేరాడు. నాగలోకంలో నాగ దేవుణ్ణి
దర్శించు కోడానికి అక్కడి ద్వార పాలకులు అనుమతించలేదు. నాగదేవుడు ప్రస్తుతం తన మందిరంలో లేడు, కార్యార్ధియై ధనాగారం వెళ్ళాడు, ఇప్పుడు మీరు నాగదేవుణ్ణి దర్శించుకోలేరని చెప్పినా, భాలేష్‌కాల్‌
దూకుడుగా ద్వార పాలకుల మాటను పెడచెవిన పెట్టి నాగ మందిరంలో ప్రవేశించి, అక్కడ ఉన్న బంగారు ఊయలలో కూర్చుని ఊగి, పక్కనే తిను పదార్థాలుంటే వాటిని ఆరగించి, తమలపాకులు నమిలి – పక్కనే
ఊంచి వేస్తాడు. ఎంతకూ నాగ దేవుడు రాకపోవడంతో, నాగలోకాన్నైతే దర్శించుకున్నా కదా అనే అనందంతో తిరిగి భూమికి పయనమైతాడు. పిదప తన మందిరానికి వచ్చిన నాగదేవుడు భాలేష్‌కాల్‌ దుశ్చర్యకు
మండి పడి, అతడి మీద కోపంతో భూలోకానికి పయనమౌతాడు. తన అంశతో జన్మించిన మేస్రం గోండులను తుద ముట్టించాలని నిర్ణయించుకొని ఆకాశాన్ని భూమిని అవరించినంతగా నోరు తెరిచి తన
కోపాన్ని ప్రదర్శిస్తాడు. విషయం తెలుసుకున్న భాలేష్‌కాల్‌ అతడి సోదరులు హడలిపోయి తమ పూజారి ప్రధాన్‌ను అడగగా, కోపించిన నాగదేవుణ్ణి సంతోషపరిచి ప్రీతిపాత్రున్ని చేసుకోవాలంటే అతడికి
యిష్టమైన పదార్థాలను సమర్పించాలంటాడు.

పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశ గిరిజనులు 75కి.మీ. దూరంలో జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలో హస్తిన మడుగు నుండి జలాన్ని సేకరిస్తారు. జలానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు అనేక గ్రామాల్లో ఊరి పోలిమేరలో సేద తీరుతారు.

అప్పుడు భాలేష్‌కాల్‌ – సోదర సమేతుడై నాగశేషుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ఏడు కడవలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచాదార, తేనె, పెసరపప్పు, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి సంతృప్తుణ్ణి గావిస్తాడు, అప్పుడు శేషుడు సంతసించి వారిని అనుగ్రహించి, తన అంశతో భూలోకంలో ఉంటున్న వాళ్ళందరిని దర్శించాలని కోరుకుంటాడు. అప్పుడు భాలేష్‌కాల్‌ తన సోదరులతో కలిసి గిరిజన గ్రామాన్ని చూపించి నాగుణ్ణి తమవద్దే, తమ మధ్యే ఉండమని వేడుకుంటాడు. అప్పుడు శేషుడు సంతసించి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను, నేను యిక్కడే ఈ కేస్లాపూర్‌లో ఉంటాను. మీ కోరికలు, కష్టాలు తీరుస్తానని అంతర్దానమవుతాడు.

అప్పటి నుండి మేస్రం జాతి గోండులు – శేషుడు అంతర్ధానమైన రోజుని పెద్ద పండగగా ప్రత్యేక భక్తిశ్రద్దలతో, నియమనిష్టలతో ఆ దేవుణ్ణి కొలచి ఆరాధిస్తారు. ఆ దినమే పుష్యమాస అమావాస్య రోజు, ఆ రోజుకు పదిహేను రోజుల ముందే గోండులు నాగ దేవుణ్ణి శుద్ధి చేయడానికి పవిత్ర గోదావరి జలాలకోసం మేస్రం వంశస్తులు కొత్త కుండల్లో – నేటికీ కాలినడకన గోదావరికి వెళ్లి పవిత్ర జలాలు తెచ్చి శుద్ధి చేసి తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తారు.
పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశ గిరిజనులు 75 కి.మీ. దూరంలో జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలో హస్తిన మడుగు నుండి జలాన్ని సేకరిస్తారు. జలానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు అనేక గ్రామాల్లో ఊరి పోలిమేరలల్లో సేద తీరుతారు. వారం రోజులు పోవడం, వారం రోజులు రావడం గడుస్తుంది. సేద తీరిన గ్రామంలో వీరిని ` ప్రత్యేకంగా గౌరవించి అన్న పానీయాలు సమర్పిస్తారు.

పున్నమి చంద్రోదయంతో మొదలైన గోదావరి జల సేకరణ కార్యక్రమం అమవాస్యతో పూర్తవుతుంది. అమవాస్య అర్థరాత్రి గోదావరి జలాలతో కేస్లాపూర్‌ ఆలయం చేరుకుంటారు.

శేషుణ్ణి పుణ్య గోదావరి జలంతో పాలతో అభిషేకించి పుట్టమన్నుతో చేసిన పోయ్యిపై నవ ధాన్యాలతో నైవేద్యం వండి అర్పిస్తారు.