నిర్మల్ కోట
భారతదేశ చరిత్రలో దేశ చరిత్రతోపాటు ప్రాంతీయ చరిత్రకు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెంగాణ రాష్ట్రానికి కూడా అనాది నుండి అంతటి ఘనమైన చరిత్ర వుంది. అందులోనూ గోదావరి నది పరీవాహక ప్రాంతమైన ఉత్తర తెంగాణ చరిత్ర పూర్వయుగం నుండి గొప్ప సంస్కృతికి, నాగరికతకు నిలయంగా వుంది. అలాంటి మహత్తర చరిత్ర కలిగిన ఉత్తర తెంగాణలో నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ‘నిర్మల్ కోట’.
ఆదిలాబాద్ జిల్లాలో డివిజన్ కేంద్రం నిర్మల్. హైదరాబాద్ నుండి నాగ్పూర్కు వెళ్ళే జాతీయ రహదారిపై వున్న ఈ పట్టణం డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి 58 కి.మీ. నిజామాబాద్ నుండి 75 కి.మీ. దూరంలో వుంది. గోదావరికి ఉత్తరాన 6 కి.మీ. దూరంలో వున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవుతో నిండి వుండేది. చుట్టూ గుట్టు, కొండ మధ్య ఈ పట్టణ నిర్మాణం జరిగింది. ఈ పట్టణం చుట్టూ వున్న గుట్టపై కోటగోడు, బురుజు లాంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి.
ఆసఫ్జాహీ నవాబు పాలన 1724లో ప్రారంభమైంది. సలాబత్ జంగ్ (1751-1761) నవాబు కాలంలో నవాబ్ ముజారిజుల్ ముల్క్ జఫిరుద్దౌలాబహదూర్ మీరాజు ఇబ్రహీం ఖాన్ ధంసా ఎలగందుల సర్కార్ పాలకునిగా నియమింపబడ్డారు.
నిర్మల్, లక్షెట్టిపేట, చెన్నూర్ ప్రాంతాలు కూడా అతని ఆధీనములోనే వుండేవి. 1747లో, జగిత్యాల స్థల దుర్గమును, నిర్మల్ గిరిదుర్గాలను ప్రెంచి ఇంజనీర్ల సహాయంతో అతను నిర్మించాడు. నిర్మల్లోని ఇబ్రహీంబాగ్లో ఇతని సమాధి ఇప్పటికీ వుంది. ఇబ్రహీం ఖాన్ పేరిట నిర్మల్లో ఇబ్రహీంబాగ్ నిర్మింపబడింది.
కొంత కాలానికి ఇబ్రహీం ఖాన్ ధంసా కుమారుడు ఎహెతెషామ్జంగ్ ఎగందుల సర్కార్ పాలకుడైనాడు. బహుక్రూరుడైన ఇతడు నిజాం నవాబునే లెక్కచేయలేదు. అందువల్ల నిజాం అలీఖాన్ ఆసఫ్జా`2 ఎలగందుల కోటను ముట్టడించడానికి పెద్ద సైన్యాన్ని పంపాడు. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో ఎలగందుల సేనకు అపార నష్టం సంభవించింది. యుద్ధం నుండి ఎహితేషామ్జంగ్ 1791లో జగిత్యాల కోటకు, ఆ తరువాత నిర్మల్ కోటకు పారిపోయాడు. నిజాం సేనలు ఎహితేషామ్ జంగ్ను పట్టుకొని బంధించారు. కాని రెండవ నిజాం అతని తల్లి విన్నపాన్ని గౌరవించి అతనిని క్షమించి అతనిని బెరార్కు సుబేదార్గా ఎలిచిపూర్కు పంపాడు.
ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మల్కు ఆ పేరు రావటం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం కూడా వుంది. 1600-1650 మధ్య కాలంలో భద్రాచలం తహసిల్దారుగా వున్న కంచర్ల గోపన్న నామధేయుడైన శ్రీరామదాసు భద్రాచలంలో శ్రీ సీతారామాంజనేయు ఆలయ నిర్మించి, ఉత్సవాలను జరిపించటానికి సర్కారుకు సంబంధించిన నిధులను ఖర్చు చేయటం వల్ల, అప్పటి గోల్కొండ నవాబు అబూల్ హసన్ కుతుబ్షా అంటే నవాబు తానీషా, శ్రీరామదాసును చెరసాలలో పెట్టించారు. శ్రీరామదాసుకు ‘వెమదవాయి నిమ్మ నాయుడు’ అత్యంత సన్నిహితుడు. నాడు కొందరు భూస్వాములు తానిషాతో చేయి కలిపి, శ్రీరామదాసుపై కుట్రపన్ని, భూమి శిస్తు విషయాల్లోనేగాక మరెన్నో తగాదాలు తీసుకొచ్చారు. ఇది తెలిసి విసుగెత్తిన ‘నిమ్మనాయుడు’ కుటుంబ సమేతంగా కొంత సిబ్బందితో కలిసి నిరాశ నిస్పృహతో గోదావరి నదీ తీరం వెంబడి చెన్నూరు, కోటిలింగా గుండా ప్రయాణించి మట్టికోటగా నెలకొని వున్న నల్లగుట్ట అనగా నేటి ఖాన్పూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఔరంగజేబు నియమించిన ఖిలేదారు నిమ్మనాయుడు రాకను అడ్డుకున్నాడు. దాంతో ఇరుసేనల మధ్య భీకర పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నిమ్మ నాయుడు విజయం సాధించాడు. ఆ ఖిలేదారు నిమ్మనాయుడు ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అయినా నిమ్మనాయుడు నల్లగుట్ట ప్రాంతంలో కొంతకాలం మాత్రమే ఉండి మరో మంచి ప్రాంతంవైపు బయలుదేరాడు.
నిర్మల్ పట్టణానికి తూర్పుదిశగా ‘పులిమడుగు’ (బత్తీస్ఘడ్ ప్రాంతం) పేరుతో ఒక బస్తీ వుండేది. చత్రపతి శివాజీ నాయకత్వంలో గోల్కొండ సైన్యాలు మహారాష్ట్ర సేన అండదండలతో పలుసార్లు మొగలు సైన్యాలను ‘పులిమడుగు’లో ఓడించారు కూడా. సైనికు యుద్ధ సమయాల్లో తలదాచుకోవడానికి కోటగోడలు, బురుజు, నేల బొయ్యారాలు (సొరంగాలు) కందకాలు మొదలగునవి ఆ ప్రాంతంలో ఆ కాలంలోనే నిర్మించబడ్డాయి.
కొన్ని రోజుల తరువాత నిమ్మనాయుడు పులిమడుగు ప్రాంతం నుండి రాత్రిపూట వెళుతుండగా అప్పటికే నల్లగుట్ట ప్రాంతంలో జరిగిన సంఘటన తెలిసి ఉండటంవల్ల పులిమడుగు ఖిలేదారు నిమ్మనాయుని చెలిమిని కోరి అతన్ని తన సహాయంగా వుంచుకోవటమేగాక వారందరికీ ఆధారంగా ఆశ్రయం కలిపించాడు.
ఒకనాడు నిమ్మనాయుడు తన తెల్ల ఏనుగుపై ఇప్పటి దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రాంతానికి బయలుదేరాడు. అక్కడి స్థల మహత్యం తెలుసుకున్న నిమ్మనాయుడు అక్కడి పులిమడుగు దుర్గాధిపతి సహకారంతో అక్కడే స్థిరపడ్డాడు. ఆ పవిత్ర స్థలంలోనే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాలను స్థాపించి నిత్యం దూప, దీప, నైవేద్యాలతోపాటు భజనాదులు చేసేవాడు. నిమ్మ నాయుడి మంచితనం, శౌర్యం, సేవాగుణం స్థానికులకు నచ్చటంతో ఈ ప్రాంతంలో నిమ్మనాయుడికి ఆదరాభిమానాలు అనూహ్యంగా పెరిగిపోయాయి.
ఈ ప్రాంతంలోని అటవీ భూ సంపత్తిని ఉపయోగంలోకి తేవడానికి భద్రాచలం, సిరివంచ, కొండపల్లి, విజయవాడ, ఖమ్మం, మధిర, ఎల్లందు, ఓరుగల్లు, కొండవీడు, వడూరు తదితర ప్రాంతాల నుండి కర్రబొమ్మలు చేసేవారిని, బ్రాహ్మణ, వైష్ణవ, ఆరాధ్య, పద్మశాలి, తెనుగు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నగిషీ మొదలైన కులవృత్తుల వారిని రప్పించి, వారి నివాసాలకై ఆ అరణ్యానికి సమీపంలో కునుబ అనే వీధిలో 12 ఇండ్లతో ఒక గ్రామాన్ని రూపొందించాడు. ఆ గ్రామానికి తన పేరు చిరస్థాయిగా ఉండటానికని ‘నిమ్మ’ అని నామకరణం చేసాడు. ‘నిమ్మ’ గ్రామాన్ని తరువాత వచ్చిన పాలకులు ‘నిర్మల్’గా మార్చారు. ఇప్పటికి కూడా కొంతమంది ‘నిమ్మ’ అనే పిలుస్తుంటారు.
నిర్మల్ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజులు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించాడు. శత్రువు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశాడు. పట్టణం చుట్టూ నిర్మించిన ప్రధానమైన రక్షణ గోడతో పాటు, రాజ సౌధం (ఖిల్లా గుట్ట) చుట్టు మరొక పటిష్టమైన రాతి గోడను నిర్మించాడు. దీనినే ‘ఆంజనేయదుర్గం’ అంటారు.
కోటలోకి వెళ్ళడానికి తూర్పు వైపు సింహ ద్వారం, దక్షిణ, ఉత్తర దిశల్లో మరో రెండు ప్రధాన ద్వారములు, సింహ ద్వారానికి దగ్గరలో తూర్పుకు ఒక చిన్న ద్వారం, సభాభవనం, హవామహల్, అంతఃపురసౌధం, మంచినీటి కోనేరుబావి, ఇలా ఆనాటి రాతినిర్మాణాలు ఇప్పటికి మనకి కనిపిస్తాయి. నాటి ప్రభుత్వం ఈ కట్టడాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల కొంత, స్థానికులు అవగాహన రాహిత్యం వలన మరికొంత చుట్టుప్రక్క ప్రాంతాల వారు రాళ్ళను కొల్లగొట్టడం వల్ల ఇంకొంత వివిధ చారిత్రాత్మక కట్టడాలన్నీ శిథిలావస్తకు చేరుకున్నాయి. కోటలో నిధుల అన్వేషణ కోసం జరిపిన తవ్వకాల వల్ల విలువైన పురాతన సంపద కనుమరుగయిపోయింది.
కోటలో కొలువై వున్న దేవతా మూర్తుల పూజ నైవేధ్య ఖర్చులకుగాను నాటి రాజు వంద ఎకరాల భూమిని ‘ఇనాము’గా ఇచ్చినట్టు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. ఆ భూములన్నీ ఆక్రమణకు గురి కావటంతో దేవతా మూర్తుల ఆలనా పాలనా కరువైపోయింది. నిమ్మరాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరాయుడు, కనింగ రాయుడు, ధంసా మొదలైన రాజు ఈ కోటలో నుండే తమ పాలన వందల సంవత్సరాలపాటు కొనసాగించారు.
నిర్మల్ ఖిల్లా ప్రాంతం అంతా రాజభవనంతో పాటు శ్యామ్ఘడ్, బత్తీస్ఘడ్, ఖిల్లా గుట్ట, దసరాసీ మోంఘన లాంటి 64 బురుజులతో అత్యంత విశాలంగా విస్తరించి శతృదుర్భేద్యంగా నిర్మించబడింది.
మదీనాలో బురుజు, బత్తీస్ఘడ్పై కుంటి వెంకట్రాయుని మట్టికోట సింహద్వారం, బురుజు, కిల్లాగుట్ట సింహద్వారం, రాజసింహాసనపు గద్దె, ఆంజనేయస్వామి మందిరం, అత్తకోడళ్ళ బావి, దసరాసీ మోంఘన ద్వారం (జంగల్పేట్ చెరువుకట్ట మీద) గోలుసు దర్వాజ, ఖిల్లాగుట్టపై గల హవామహల్ అంటే నాట్యశాలతో పాటు రాజరాజేశ్వరాలయము, వెంకటేశ్వరాలయము లాంటి కట్టడాలు చూపరుల కళ్ళను తిప్పుకోకుండా చేయటమే కాక నాటి శిల్ప ప్రతిభకు గీటురాళ్ళుగా నేటికీ తార్కాణంగా నిలుస్తున్నాయి. వీటిలో ప్రధానంగా రాజభవనం (ఖిల్లా గుట్ట) శ్రీనివాసరావు కాలంలో కట్టబడింది. బుడతకీచు అనే సన్నిహితుడి సలహా మేరకు, శ్రీనివాస రావు దీనిని ఫ్రెంచ్వారి సహాయంతో కట్టించారు. కోట చుట్టూ సున్నంతో ఎత్తయిన బలిష్టమైన రాతి, ఇటుక గోడ, గోడపొడవునా లోతైన కందకం త్రవ్వించి కందకంలో ఎ్లప్పుడూ నీరు వుండే విధంగా అమర్చి బయట నుండి శత్రువు కోటలోకి రాకుండా మొసళ్ళను అందులో దింపేవారు.
ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవలసింది గోలుసు దర్వాజ గురించి, ఈ దర్వాజకి పెద్ద ఇనుప పలక వుండేది. వీటని బలిష్టమైన గొలుసులతో పెద్ద చక్రాలకు చుట్టి వుంచేవారు. ద్వారం మూసివేయడానికి తెరవడానికి గొలుసులను ఉపయోగించేవారు. వీటిని లాగడానికి ఏనుగును ఉపయోగించేవారు. ఈ దర్వాజా నిర్మాణ తీరును చూస్తే శత్రువుల రాకను అడ్డుకోవడానికి ఎంత నైపుణ్యంతో నాటి నిర్మాణాలు చేసారో అర్థమవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి వెడల్పు పనుల కారణంగా దర్వాజకు సంబంధించిన ఒక దిమ్మె ధ్వంసం అవటంతో మరొక దిమ్మె మాత్రమే మనకు కనిపిస్తుంది.
మొత్తంగా నిర్మల్ పట్టణంలో ఏడు సింహల ద్వారాలు ఉండేవి. రాజా శ్రీనివాసరావు కాలంలో మొదటి ప్రహరీలో సైనిక శిబిరం ఏర్పాటు చేసేవారు. అప్పటి కాలంలో పెట్టిన పేర్ల ఆధారంగా నేటికీ కొనసాగుతున్న నివాస వాడలు ఇప్పటికీ మనకు పట్టణంలో కనిపిస్తాయి. నాటి సింహద్వారాలు మాత్రం మనకు శిథిలావస్థలో కనిపిస్తాయి. కొన్ని ద్వారాలు అసలు ఆనవాళ్ళే లేకుండా పోయాయి. నిర్మల్ కోటల్లో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న కోటల్లో ‘బత్తీస్ ఘడ్’ కోట కూడా ఒకటి.
16వ శతాబ్దంలో ఔరంగజేబు ఆజ్ఞతో నిర్మించబడ్డ కోటనే ఈ బత్తీస్ఘడ్. మాలిక్ కాఫర్ దండయాత్ర నుండి తప్పించుకోవడానికి ఈ కోట కట్టబడిందని చరిత్రకారుల అభిప్రాయం. బత్తీస్ఘడ్ కోట ప్రాంతము, నిర్మల్ పట్టణానికి తూర్పున ఉంది. ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో దఫ్తర్ పులి మడుగు అనేవారు. అప్పటి సేనానాయకుడు ‘మానిక్ఘడ్, మహుక్, వడూర్, కుంటాల, అప్పారావుపేట్, ఎలగడప, ఎలగందల’ మొదలయిన 32 గడి కోటలను సైన్యం కొరకు నిర్మించాడు. ఆ 32 గడిల గుర్తుగా ఒకే చోట 32 గదులు ఈ కోటలో నిర్మించటం వల్ల దీనికి ‘బత్తీస్ఘడ్’ అని పేరు పెట్టారు.
నిమ్మ పట్టణాన్ని ఏలిన కుంటి రాజా వెంకట్రాయుని మేనల్లుడు రాజా శ్రీనివాసరావు తన పాతికేళ్ళ పాలనలో పట్టణం చుట్టూ గట్టి ప్రహరీగోడతోపాటు, 64 బురుజులు, ప్రహరీ గోడ పొడగునా లోతైన కందకం నిర్మించాడు. నాటి కట్టడాలు, తదితర విషయాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని నిమ్మ పట్టణంలోని బత్తీస్ఘడ్, శ్యాంఘడ్, సోన్ఘడ్ ముందు రాతిగుండ్లపై మోడి భాషలో ఆయన శాసనాలు చెక్కించాడు. అయితే చాలావరకు ఆ బురుజు కనుమరుగైపోగా కోట చుట్టు నిర్మించిన ప్రహరీగోడ కూలిపోయి కందకం పూడిపోయింది. ఖిల్లాగుట్టపై గల అరుదైన చారిత్రక శాసనాలు కూడా నామరూపాలు లేకుండా పోయాయి.
శత్రుదుర్భేద్యంగా అద్భుత నిర్మాణ కౌశలంతో నిర్మించబడ్డ 32 కోటల నడుమ విలక్షణంగా శోభిల్లే బత్తీస్ఘడ్ నుండి రాచరికపు వైభవ చంద్రికను కురిపించిన నిర్మల్ నిమ్మనాయుడు, వేంకట్రాయుడు, శ్రీనివాసరావు ధన్యు. వారు ఇక్కడ నిర్మించిన వివిధ మందిరాలు సంస్కృతి గోపురాలుగా యశోధ్వజాలు ఎగురవేసి నాటి ప్రజలకు నిమ్మ రామరాజ్యమిచ్చింది అని స్థానికులు నేటికీ చెప్పుకుంటారు. ఏదెమైనా ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాల్ని కాపాడుకోవడం అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలందరి కనీస బాధ్యత. నిర్మల్ కోటను భావితరాలకోసం పదిలపరచాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచి, రక్షణ చర్యలు చేపడితే ఇది గొప్ప టూరిజం కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆ వైభవం ఈ కోటకు తొందరగా దక్కుతుందని ఆశిద్దాం.