దోపిడీని ప్రశ్నించి, సమాజాన్ని కదిలించిన కవి గూడ అంజయ్య
తన పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి, దోపిడీని ప్రశ్నించిన కవి గూడ అంజయ్య. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, సామాన్యుల బతుకులు ఏవిధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకుని, ప్రజలను జాగృతం చేసే దిశగా రచనలు సాగించాడు.