తెలంగాణ మహా కుంభమేళా…
ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు.