బహుజన వైతాళికుడు పైడి తెరేష్ బాబు
పిడుగులు వర్షించి నట్లు కవిత్వం వ్రాసి, వర్తమాన కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ఎగుమతి చేసిన అసామాన్య కళాకారుడు పైడిశ్రీ. పూల నుండి పరిమళాల్ని తుంచేసిన మతోన్మాద కుతంత్రాలను ధిక్కరించి, ఊరు నుండి ఉనికిని తుడిచేసిన మనుధర్మ కుట్రదారులపై అక్షర యుద్ధం ప్రకటించి