‘యెల్ది మాణిక్యాల’ వెలుగులు
సంస్కృతకవి భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నాలుగా మలిచి తెలుగు వారికందించారు. ఆ తోవలోవి కాకున్నా ఆ కోవకే చెందినవి యెల్ది మాణిక్యాలు. ఇందులో యెల్ది సుదర్శన్ తన జీవితానుభవాల నుంచి ఏర్చికూర్చిన 108 ముక్తక మాణిక్యాలున్నాయి.