చూడచక్కని ‘కొండపల్లి’ చిత్రాలు
1924 జనవరి 7వ తేదీన వరంగల్ జిల్లా పెనుగొండలో పుట్టిన శేషగిరిరావు రూపకల్పనచేసిన పోతన, నన్నయ్య, రామదాసు, అన్నమయ్య, వేమన, నాగార్జున, తెలుగుతల్లి, భాగమతి, ఆండాళ్ చిత్రాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు ఆనవాళ్ళు. ఆయన వేసే రేఖలలో, రంగులలో జీవం తొణికిసలాడుతుంది. అందుకే`ఆయన వేసిన చిత్రాలు పండితులేకాదు, పామరులు చూసినా ఎంతగానో మురిసిపోతారు.