హైదరాబాద్ రాజ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం
19వ శతాబ్దం చివరి నాటికి దేశంలో అనేక బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో పెద్ద నదులపై ఆనకట్టలు, డ్యాంల నిర్మాణం చేసినారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఇంజనీరింగ్, టెక్నాలజీని సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యంలోకి తీసుకొచ్చాడు. భారీ ప్రాజెక్టుల సాంకేతికతను అందిపుచ్చుకున్న మొదటి సంస్థానం హైదరాబాదే.