కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం
తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్ 21న సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.