సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత
సివిల్ సర్వీసెస్ (యుపీఎస్సీ) పరీక్షల్లో తెలంగాణ యువత జయ కేతనం ఎగురవేసింది. 2020 సంవత్సరం సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన శ్రీజ జాతీయస్థాయిలో 20వ ర్యాంకు సాధించి రాష్ట్ర ప్రాభవాన్ని చాటింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించి సివిల్స్కు ఎంపికయ్యారు.