స్మారక చిహ్నాలపై సభలో చర్చ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మారక చిహ్నాలను శాసనసభ ఎదుటగల ‘గన్పార్క్’లో, సికింద్రాబాద్లోని క్లాక్టవర్ పార్క్లో ఏర్పాటు చేయాలన్న నగర కార్పొరేషన్ నిర్ణయాన్ని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అడ్డుకున్నది. పార్కుల స్థలం కార్పొరేషన్దికాదని, కనుక కార్పొరేషన్ తమదికాని స్థలంలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం కార్పొరేషన్కు తెలిపింది.