kcr announces 3 lakhs compensation to martyred kisans at delhi kisan movement

రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సహాయం

రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సహాయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని దేశంలోని  రైతులు గత సంవత్సర కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు, ఒక్కో రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే కేంద్రం కూడా ఒక్కో మృతిచెందిన రైతు కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.