అన్నీ ఇస్తాం..ఉద్యోగాలు ఇవ్వండి..!
ఎంతో కష్టపడి, ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం, భూములు, నీరు, విద్యుత్ మీరు ఏది కోరితే అది అందిస్తున్నం, మీరు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పారిశ్రామికవేత్తలను కోరారు.