ఉపాధి హామీని బలోపేతం చేయాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినూత్న పద్దతుల్లో మరింత బలోపేతం చేయాలని, దీనిని కుదించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేరళలోని కోవలంలో జనవరి 6న ఏర్పాటు చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దక్షిణాధి రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు.