తెలంగాణ ఎంపీలతో ప్రధాని ఇందిర చర్చలు
తెలంగాణ ఉద్యమం స్తబ్దతకు గురైందనుకున్న ప్రధాని ఇందిరను హైదరాబాద్ గన్పార్క్, క్లాక్టవర్ల వద్ద అమరుల స్థూపాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సంఘటనలు ఆందోళనకు గురిచేశాయి.
తెలంగాణ ఉద్యమం స్తబ్దతకు గురైందనుకున్న ప్రధాని ఇందిరను హైదరాబాద్ గన్పార్క్, క్లాక్టవర్ల వద్ద అమరుల స్థూపాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సంఘటనలు ఆందోళనకు గురిచేశాయి.
డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య ఫిబ్రవరి 25న సికింద్రాబాద్లోని క్లాక్టవర్ పార్క్లో శంకుస్థాపనకు సిద్ధమైనారు. గన్పార్క్వద్ద మేయర్ను, మరికొందరు నేతలను అరెస్ట్చేసి జైళ్ళో పెట్టినా డిప్యూటీ మేయర్, ఉద్యమకారులు వెనుకంజ వేయలేదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థి యువకుల త్యాగాలను భవిష్యత్ తరాలు స్మరించుకోవడానికి అమరవీరుల స్మారక చిహ్నాలను నిర్మించాలన్న తెలంగాణ ప్రజాసమితి ఆకాంక్షను,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మారక చిహ్నాలను శాసనసభ ఎదుటగల ‘గన్పార్క్’లో, సికింద్రాబాద్లోని క్లాక్టవర్ పార్క్లో ఏర్పాటు చేయాలన్న నగర కార్పొరేషన్ నిర్ణయాన్ని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అడ్డుకున్నది. పార్కుల స్థలం కార్పొరేషన్దికాదని, కనుక కార్పొరేషన్ తమదికాని స్థలంలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం కార్పొరేషన్కు తెలిపింది.
ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని కోరుతున్న శాసనసభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’గా శాసనసభలో ఫ్రంట్గా ఏర్పడ్డారు.
తెలంగాణ ప్రజా సమితికి కొత్త కార్యవర్గాన్ని, ఉపసంఘాలను 1970 జనవరి 17న డా|| చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రజా సమితి ఉపాధ్యక్షులుగా శాసనసభ్యులు కె. అచ్యుతరెడ్డి, ఎస్.బి.గిరి, ఎ. మదన్మోహన్, శాసనసభ్యులు టి. అంజయ్య, ఎం.పి. బాకర్ అలీఖాన్లు, ప్రధాన కార్యదర్శులుగా టి. హయగ్రీవాచారి, ఎమ్మెల్యేలు పోల్సాని నరసింగారావు, జి. రాజారాం, ఎస్. వెంకారెడ్డి (ఎమ్మెల్సీ), బి. సత్యనారాయణరెడ్డి, కోశాధికారిగా రాంకిషన్ ధూత్లను డా|| చెన్నారెడ్డి నియమించారు.
ఈ మహాసభకు వి.బి. రాజు, ఎన్. రామచంద్రారెడ్డిలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపినారని, కొండా లక్ష్మణ్కు ఆహ్వానం పంపలేదని పత్రికల్లో వార్తలు వెలువడినాయి.
తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డా|| చెన్నారెడ్డిని అధ్యక్షస్థానంనుండి తొలగిస్తూ రాష్ట్రకార్యవర్గాన్ని పునర్నిర్మించడం అనివార్యం అయిందని టి.ఎస్. సదాలక్ష్మి డిసెంబర్ 5న ప్రకటించారు.
రాష్ట్రపతి ఎన్నికలతో కాంగ్రెస్లో ప్రారంభమైన వివాదాలు ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించేదాకా వెళ్ళాయి. 1969 నవంబర్ 12న సమావేశమైన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఇందిరాగాంధీపై 5 ఆరోపణలు సంధిస్తూ ఆమె క్రమశిక్షణ ఉల్లంఘించిందంటూ కాంగ్రెస్నుంచి బహిష్కరించింది.