అవని అంతటా ఆవిర్భావ ఉత్సవాలు

రాష్ట్రంలో వాడవాడలా అవతరణోత్సవాలు  జరుగుతుండగా, అవని ఎల్లెడలా అనేక దేశాల్లో తెలంగాణ రాష్ట్రం అవతరణోత్సవాలు జరిగాయి. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’, నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ’ అన్నట్లు అంతర్జాతీయంగా ఆయా దేశాలో వున్న తేట తెలంగాణ వాసులందరూ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను, ఎంతో గొప్పగా జరుపుకున్నారు.

ఆంగ్లేయుల గడ్డపై ఆవిర్భావ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నారై నవీన్‌రెడ్డి అధ్యక్షతన లండన్‌లో జరిగిన వేడుకలో బ్రిటన్‌లోని పలు ప్రదేశాల నుంచి తెలంగాణ వాదులందరూ భారీగా వచ్చి పాల్గొనడం విశేషం.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, రాష్ట్ర ఆవిర్భావ పండుగను పావనిరెడ్డి ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించారు. ఈ పండుగలో పాలుపంచుకోవడానికి లండన్‌ పార్లమెంట్‌ సభ్యు స్టీఫెన్‌ టిమ్స్‌, కౌన్సెర్‌ సీతియాన్‌సన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఒమన్‌ రాజధాని మస్కట్‌లో శంకర్‌ అడువ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాలలో స్థానిక తెలంగాణ వాసులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా మలిచే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.

బహ్రెయిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులర్పించి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఆనందంగా జరుపుకున్నారు. రాధారపు సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో అక్కడి తెలంగాణ ఎన్నారైలందరూ తెలంగాణ డెవప్‌మెంట్‌ ఫోరమ్‌ (కెనడా) యూఎన్‌ఏ, మెల్‌బోర్న్‌ తెలంగాణ ఫోరం (ఎంటీఎఫ్‌) ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా వేడుకలను నిర్వహించుకున్నారు.

టీడీఎఫ్‌-యూఎస్‌ఏ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌ కలువ, పెన్సిల్వేనియా, పిట్స్‌బర్గ్‌లో జరిగిన వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జూన్‌ 5 నుండి 13 వరకు డెట్రాయిట్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ డల్లాస్‌, ఆస్టిన్‌, బ్లూమింగ్టన్‌, ఓర్లాండో, రోచెస్టర్‌, సాక్రమెంటో, లాస్‌ఏంజెల్స్‌ నగరాలో టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు.
ఎన్నో ఆశతో సాధించుకున్న మాతృరాష్ట్రాన్ని, అమృతమయ రాష్ట్రంగా మచుకోవడానికి ప్రవాసులందరమూ పనిచేద్దామని ప్రతినబూనారు.

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో మిస్సిస్సౌగలో, తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకున్నారు. ఈ సంబురాలో కెనడాలోని ఒంటారియో ప్రభుత్వ ఆరోగ్య శాఖమంత్రి దీపిక దామెర్ల, భారత ప్రభుత్వ రాయబారి అఖిలేష్‌ మిశ్రా, తెలంగాణ కెనడా అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్ర స్వర్గం పాల్గొన్నారు.

అమెరికా: అమెరికాలోని కొంబస్‌, బోస్టన్‌, మినియాపోలీస్‌ అట్లాంటా, ఫ్లోరిడా నగరాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కన్నుకు నిండైన పండుగలా జరుపుకున్నారు. కోలంబస్‌లో తన్నీర్‌ మహేశ్‌ ఆధ్వర్యంలో, బోస్టస్‌లో తక్కెళ్ళపల్లి అరవింద్‌ నాయకత్వంలో, మినియాపోలీస్‌లో నాగేందర్‌ మహీపతి సారధ్యంలో, శివకుమార్‌ రామడుగు, కరుణాకర్‌ అసిరెడ్డి, అనిల్‌ బొద్దిరెడ్డి, రవిచందర్‌, వెంకట్‌ వీరమనేని పర్యవేక్షణలో అట్లాంటా నగరంలో వేడుకను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా మంత్రి హరీష్‌రావ్‌ జన్మదినాన్ని కూడా కేక్‌ కట్‌ చేసి సంబరం చేసుకున్నారు.

సన్నీవేల్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌లో జరిపిన సంబురాలకు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, పారిశ్రామికవేత్త ఓం నమాసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించి ప్రారంభించారు. ఈ సంబురాలలో సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో వున్న తెలంగాణ ఎన్నారైలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలోని నార్త్‌కరోలినా రాష్ట్రంలో వున్న చార్లెట్‌ నగరంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు వెంగళ్‌ జలగం అధ్యక్షత వహించారు.

కాలిఫోర్నియా: బేఏరియాలో అమెరికా టెక్నాజీ సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ అవతరణోత్సవాను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా స్టేట్‌ క్చరల్‌ అంబాసిడర్‌ శ్రీనివాస్‌ మనుగడ హాజరై జయ జయహే తెంగాణ గీతాన్ని ఆపించారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్న తెలుగు అసోసియేషన్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో పేద విద్యార్థుకు ఉచిత విద్యను అందిస్తున్న ఏహెచ్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవల్ని కొనియాడారు. ఈ వేడుకను మైక్రోఇన్ఫో ఎండీ అప్పిరెడ్డి అన్నపరెడ్డి జ్యోతి ప్రజ్వలనచేసి ఆరంభించారు.