మన చరిత్ర

అక్షర రూపంలో తరతరాల వైభవం

అక్షర రూపంలో తరతరాల వైభవం

తెలంగాణ గడ్డ ఉజ్వలమైన చరిత్రకు, సుసంపన్నమైన భాషా సాహిత్యాలకు, తరతరాలుగా జనావళిని ఉర్రూతలూగిస్తున్న కళారూపాలకు, విలక్షణ సంస్కృతికి ఆటపట్టు. తెలంగాణ గొప్పదనం తెలియని వారు మాట్లాడిన హేళన పూర్వక మాటలే అలనాడు సురవరం ప్రతాప రెడ్డిని గోలకొండ కవుల సంచిక రూపకల్పనకు పురి గొల్పినవి.

భాషా సాంస్కృతిక వికాసం

భాషా సాంస్కృతిక వికాసం

తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలనే సంకల్పంతో, దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘సాంస్కృతిక సారథి’’ వ్యవస్థను ఏర్పాటు చేసి 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఉపాధిని కల్పించింది.

చారిత్రక, శిల్పకళా అద్భుతం రామప్ప రుద్రేశ్వరాలయం

చారిత్రక, శిల్పకళా అద్భుతం రామప్ప రుద్రేశ్వరాలయం

యావత్‌ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ఏకీకృతం చేసి సమర్థవంతంగా పరిపాలించిన కాకతీయులు అన్నిరంగాలలో రాజ్యాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చి వందల, వేల చెరువులు త్రవించినారు. శైవం, వైష్ణవం, జైనం, శాక్తేయం … అన్ని మతాలను ఆదరించి సర్వమత సమానత్వాన్ని పాటించినారు.

యాదాద్రి కీర్తి కిరీటం..

యాదాద్రి కీర్తి కిరీటం..

యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ ప్రాంత ఆలయ వైభవ శోభకు అందమైన అలంకారం.. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ ప్రాంత ధార్మిక యోగానికి తార్కాణం.. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ ప్రాంత సనాతన సాంస్కృతిక జీవన వికాసానికి నిలువుటద్దం..

పానుగల్లులో ఆలయ సముదాయం!!

పానుగల్లులో ఆలయ సముదాయం!!

నల్గొండ జిల్లాలోని నేటి జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణానికి 2కి.మీ. దూరంలో జిల్లా కేంద్రంలో కలిసిపోయిన ప్రాచీన నగరం పానుగల్లు. ఇది కందూరు చోళులకు రాజధాని నగరం. ఇక్కడ అత్యంత అద్భుతమైన ఆలయ సంపద నేటికీ సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తుంది.

అక్కడ మైకుల్లో పత్రికా పఠనం !

అక్కడ మైకుల్లో పత్రికా పఠనం !

పవిత్ర పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదీ తీరాన చెన్నూరు ప్రాంతంలో విజ్ఞాన కొండ. అదే శ్రీ గోదావరి వాచనాలయం(గ్రంథాలయం).

ధార్మిక, రాజకీయ రాజధాని కొలనుపాక

ధార్మిక, రాజకీయ రాజధాని కొలనుపాక

తెలంగాణలో రాజధాని నగరంగా, పవిత్ర క్షేత్రంగా వెలసిన ప్రాచీన మహానగరాల్లో కొలనుపాక ఒకటి. ఇది 400 సంవత్సరాలు (క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్ది వరకు) సువ్యవస్థిత రాచవైభవంతో, సుప్రతిష్ఠిత ఆలయాలతో విరాజిల్లింది. కొళ్లిపాక, కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె, కొలనుపాక, కుల్యపాక వంటి వివిధ నామాలతో, సంస్కృత, కన్నడాంధ్ర శాసనాలలో వివరించబడ్డది.

బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం

బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం

తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.

వెలుగు చూస్తున్న అడవిబిడ్డల కళ

వెలుగు చూస్తున్న అడవిబిడ్డల కళ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.