అక్కడ మైకుల్లో పత్రికా పఠనం !
పవిత్ర పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదీ తీరాన చెన్నూరు ప్రాంతంలో విజ్ఞాన కొండ. అదే శ్రీ గోదావరి వాచనాలయం(గ్రంథాలయం).
పవిత్ర పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదీ తీరాన చెన్నూరు ప్రాంతంలో విజ్ఞాన కొండ. అదే శ్రీ గోదావరి వాచనాలయం(గ్రంథాలయం).
తెలంగాణలో రాజధాని నగరంగా, పవిత్ర క్షేత్రంగా వెలసిన ప్రాచీన మహానగరాల్లో కొలనుపాక ఒకటి. ఇది 400 సంవత్సరాలు (క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్ది వరకు) సువ్యవస్థిత రాచవైభవంతో, సుప్రతిష్ఠిత ఆలయాలతో విరాజిల్లింది. కొళ్లిపాక, కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె, కొలనుపాక, కుల్యపాక వంటి వివిధ నామాలతో, సంస్కృత, కన్నడాంధ్ర శాసనాలలో వివరించబడ్డది.
1. క్రతువుతో పునర్జన్మ పొంది క్షత్రియుడిగా ప్రకటించుకున్న రాజు?
తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.
దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా.
యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి.
ఈ ప్రాచీన తెలంగాణ మహానగరం తుంగభద్ర పడమటి తీరాన నది ఒడ్డున గల నగరం. పశ్చిమ చాళక్యులలోని ఒక శాఖ రాజవంశం రాజధానిగా చేసికొని పాలించిన మహోన్నత సుందర నగరం. ఈ సౌందర్యానికి ప్రధాన కారణం ఇక్కడి నవబ్రహ్మాలయాలు కృష్ణ, తుంగ భద్రల నడిమి సీమగా దీనికి ‘నడిగడ్డ సీమ’ అని కూడా పేరుంది.
ప్రకృతిని, పూలను దేవతగా పూజించే సంస్కృతి మన తెలంగాణ ప్రజలకే సొంతం. అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము. అయితే ఈసారి నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వినూత్నంగా ఆలోచించారు. జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నారాయణపేటలోని భారం బావి వద్ద అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
భారతదేశంలోనే మొట్టమొదటగా గ్రంథాలయాల ఉన్నతికి బరోడా మహారాజు శియాజీరావ్ గైక్వాడ్ ప్రయత్నం చేసి అలెన్ బోర్దన్ అనే విదేశీయుని సహాయ సహకారాలతో అద్భుతమైన ప్రక్రియకు నాంది పలికారు. బరోడా ప్రాంతంలో పౌర గ్రంధాలయాలు, ట్రావెల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.