జలవనరుల్లో మన వాటా వదులుకోం కాళేశ్వరం ప్రాజెక్టు భూమిపూజ సందర్భంగా సీ.ఎం. కేసీఆర్
గోదావరి జలాల్లో మన రాష్ట్రానికి వచ్చిన వాటా నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా నీటిని కూడా ఆంధ్రప్రదేశ్కే మళ్ళించుకు పోయారని, ఇప్పుడు ఆ ఆటలు సాగబోవన్నారు.