నూతన ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు వీరే…
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొదట శాసనసభ్యుల కోటాలో ఉన్న 6 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగగా, అనంతరం స్థానిక సంస్థలకు సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు.