యాదగిరి నరసింహుని సేవలో విరబూసిన బుచ్చిదాసు సంకీర్తనలు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో ప్రముఖమైనది, ఎన్నదగినది యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం. పంచ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో నరసింహ స్వామి కరుణాభరితుడై, ప్రసన్న హృదయుడై, యోగానందుడై, చక్ర, శ్రీ లక్ష్మీ నారసింహ రూపుడై ఉన్నాడు.