యాదాద్రీశా గోవిందా!
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా యాదాద్రి ఆలయం పునః ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా యాదాద్రి ఆలయం పునః ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
యాదేశైలే మహాపుణ్యం
విష్ణు పాదావసేచనమ్
విష్ణుకుండ మతిఖ్యాతిమ్
తీర్థమైశ్వర్య దాయకమ్.
తెలంగాణా…. అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజ్యం ఇది. ఇవే కాకుండా పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ తెలంగాణా ప్రాంతం. బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని కూడా సమాన స్థాయిలో ఆరాధించారు.
యాదాద్రి పునఃనిర్మాణంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతారనే మాటలు సత్యసుందరాలు.
ఈ
యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి.
ఉగ్ర స్వరూపుడైన నారసింహుడు యాదరుషి తపస్సు ఫలితంగా యాదాద్రి గుహలో వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు